prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:01 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ప్రయాణికులకు పోలీసుల హెచ్చరిక: అక్సాయ్‌పల్లె వాగు ఉధృతి, ప్రత్యామ్నాయ మార్గాలు సురక్షితం

ధర్మపురి పరిధిలోని అక్సాయ్‌పల్లె వాగు వరద తీవ్రతతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధర్మపురి నుంచి జగిత్యాల వైపు వెళ్లే ప్రయాణికులకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా, అటుగా వెళ్లే వాహనదారులు ధర్మపురి నుండి రాయపట్నం, రాజారాంపల్లి మీదుగా జగిత్యాలకు చేరుకోవాలని సూచించారు. వరద తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ (2) ఎమ్ రవీందర్ కుమార్ విజ్ఞప్తి చేశారు.