prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:45 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ భూములు అక్రమిస్తే చర్యలు_ సిద్ధవటం తహశీల్దార్ తిరుమల బాబు

కడప జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15)సిద్ధవటం మండలం,జంగాలపల్లి రెవెన్యూ గ్రామం కమ్మ పాలెం గ్రామానికి సంబంధించిన 207,218 సర్వే నం.ల లోని 20 ఎకరాల  ప్రభుత్వ భూములు అక్రమిస్తే చర్యలు_సిద్ధవటం తహశీల్దార్ తిరుమల బాబు.ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు జంగాలపల్లి రెవెన్యూ గ్రామం కమ్మ పాలెం గ్రామానికి సంబంధించిన 207,218 సర్వే నం.ల లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వటం వలన,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.సిద్దవటం మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు,వారి రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా జేసీబీ యంత్రాలతో కబ్జాదారులు నాటిన మొక్కలను,ఫెన్సింగ్ ఫోల్స్ ను తీసివేయటం జరిగింది.ఈ సందర్బంగా తహసీల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ సిద్దవటం మండలం లో ఏ గ్రామంలో అయిన ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రభుత్వ భూములను అక్రమిస్తే కేసులు కూడా నమోదులు చేస్తామని హెచ్చరించారు.