ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలకు చేరువ చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ న్యూరో సర్జరీ, ఫిజియోథెరపీ, 2డీ ఎకో, ఏటీఎఫ్, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో ఫిజీషియన్ విభాగాలను పరిశీలించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డా. హిమబిందు సింగ్, సీఎస్ఆర్ఎంఓ డా. కృపాబాయి, డా. అప్పారావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.