ఘట్కేసర్, మే 10: హైదరాబాద్లో ఈరోజు నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోరుతూ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ బీజేపీ నాయకుడు గొల్లపూడి శ్రీనివాస్తో పాటు ప్రభాకర్ మారుతి బార్బర్, జోతిబా కదం, గొల్లపూడి శ్రీనివాసరావు, గంట శరత్చంద్ర రెడ్డి, పాకాల వెంకటేష్, ఐ.వి. బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ సభ దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు మరియు ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉండబోతుందని నాయకులు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.