prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 12:19 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి.. 

సిద్దిపేట్, ఏప్రిల్ 27, ప్రజావాణి

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండితమసమస్యల జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం వచ్చేసిన ప్రజల నుండి మొత్తం 98 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.