సిద్దిపేట్, జూన్ 13,ప్రజావాణి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.