prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:31 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన..

సిద్దిపేట జిల్లా, మార్చి 7, ప్రజావాణి

చేర్యాల పట్టణంలోని సుందరయ్య నగర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.నూతనంగా గెలిచిన స్థానిక నాయకులకు ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, మార్చి 6 నుంచి మార్చి 12 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు.అధికారులు, కౌన్సిలర్ లకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్యసంబంధించిచేయాల్సిన పనులు మున్సిపల్ కమిషనర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకొని వస్తె వెంటనేవాటినిపరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చెయ్యాలని, ఏ ఫైల్ తిరస్కరించిన స్పష్టమైన కారణం తెలియజేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గోన్నాలని ఈకార్యక్రమాన్నివిజయవంతం చెయ్యాలని తెలిపారు.