prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 11:13 am Digital Edition : RAJASHEKARREDDY

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

బెజ్జంకి, మార్చి 30(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామం వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకు బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఏవో పాక మంజుల తన తల్లి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని మండల ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్, గ్రామ సర్పంచ్ రవళి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలు గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారని, వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.