prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 7:50 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోలీస్ స్టేషన్‌లోనే ధైర్యంగా కౌంటర్… “ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు అంటున్న!” — జక్కంపూడి రాజా

తూర్పు గోదావరి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) రంగంపేట మండలం మత్స్యకార ఎన్నికలలో దొడ్డిగుంట ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీటీసీపై అనపర్తి సీఐ ప్రవర్తించిన తీరు చూస్తే,ఇది ఒక్క వ్యక్తిపై జరిగిన దౌర్జన్యం కాదు బలహీన వర్గాల గౌరవాన్ని తాకేంత తీవ్రమైన అణచివేతగా కనిపిస్తోంది,అధికారాన్ని అడ్డంగా ఉపయోగించి భయపెట్టే ప్రయత్నాలు,ప్రజాస్వామ్య విలువలను త్రొక్కే చర్యలే,ఇలాంటి చర్యలు ఎప్పటికీ నిలవవు,ప్రజలు ఎప్పటికైనా ప్రతిస్పందిస్తారు,ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా,డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి,గట్టిగా స్పందిస్తూ,బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం,ప్రజల పక్షాన నిలిచిన గొంతుకగా నిలిచింది,చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని విస్మరించి,అధికార దుర్వినియోగానికి దిగితే,ప్రజలు మౌనంగా ఉండే రోజులు పోయాయి,పోలీస్ స్టేషన్‌లోనే నిలబడి,ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు,అని ధైర్యంగా కౌంటర్ ఇచ్చిన జక్కంపూడి రాజా,మాటలు,ప్రజల్లో ధైర్యం నింపుతున్నాయి,ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి