విజయవాడ (మే 17 ప్రజావాణి) ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, .ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహణ. ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ గారి ఆదేశాలు మేరకు డీసీపీ శ్రీమతి ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి, ఐపీఎస్ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.బాధితుల నుండి మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించి, ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.భూ / ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు 39 భార్యాభర్తలు, కుటుంబ కలహాలు వాహనదారులకు అనే నినాదంతో హెల్మెట్ వినియోగం పై అవగాహన కల్పిస్తున్న ఎన్.టి.ఆర్.జిల్లా ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదభారిన పడిన వారిని సత్వరమే స్పందించి ఆసుపత్రి లో చేర్పించిన వారికి పి.ఎం.రాహత్ క్రింద రూ.25 వేల రూపాయల బహుమతి పై అవగాహన.నగరంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి. శ్రీమతి షేక్ షిరిన్ బేగం ఐ.పి.ఎస్. గారి సూచనల మేరకు ట్రాఫిక్ ఏ.సి.పి. రామచంద్రరావు గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు గారు వారి సిబ్బందితో కలిసి నగరంలోని వన్ టౌన్ మోడల్ గెస్ట్ హౌస్ వద్ద అనే నినాదంతో వాహనదారులకు మోటారు వాహన చట్టాలపై మరియు హెల్మెట్ ధరించడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒన్ ట్రాఫిక్ ఏ.సి.పి.శ్రీ రామచంద్ర రావు గారు, ఒకటవ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉమా మహేశ్వర రావు గారు వారి సిబ్బందితో కలిసి ఒన్ టౌన్, అమ్మవారి టెంపుల్ దగ్గరలో గల మోడల్ గెస్ట్ హౌస్ వద్ద వాహనధారులను తనిఖీ చేసి హెల్మెట్ మరియు దానికి ఉండే క్లిప్ యొక్క అవశ్యకతను తెలుపుతూ అవగాహన కల్పించడం జరిగింది.అదేవిధంగా రోడ్డు ప్రమాదభారిన పడిన వారిని దగ్గరలోనే హాస్పటల్లో జాయిన్ చేయించడానికి ఒక గోల్డెన్ అవర్ ఉంటుందని,అవర్ ఆ సమయం లో క్షతగాత్రులని హాస్పిటల్ లో జాయిన్ చేపించినట్లయితే 99.9% వారిని రక్షించవచ్చని, అందరికీ ప్రాణాన్ని సేవ్ చేసే అవకాశం రాదని, మన దగ్గర్లో ఎవరికైనా ఆక్సిడెంట్ అయిన ఎడల సత్వరమే స్పందించి ఆస్పత్రిలో చేర్పించి మంచి చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందే ఉండాలని తెలియపరుస్తూ, ఆసుపత్రి లో చేర్పించిన వారికి పి.ఎం.రాహత్ క్రింద రూ.25 వేల రూపాయల బహుమతిని అందించడం జరుగుతుందని, గాయపడిన బాధితులకు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచితంగా చికిత్స లేదా వారం రోజుల పాటు ఏ ఆసుపత్రిలో నైనా డబ్బులు లేకుండా చికిత్స పొందవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకుని దానికి సంబంధించిన క్లిప్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కిందకు జారి పడిపోతుందని, దానివలన హెల్మెట్ పెట్టుకున్న గాని ప్రమాదాల బారిన పడుతున్నారని ద్విచక్ర వాహనదారులను కౌన్సిలింగ్ నిర్వహించడమైనది. హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడుపుతున్నప్పుడు మనం హెల్మెట్ ను క్లిప్పు బిగించి పూర్తిగా పెట్టుకోవాలని తద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని, దీని ద్వారా మన కుటుంబాలకు ఎటువంటి శోకం కలిగించకుండా గమ్యస్థానాలకు చేరుతామని తెలిపారు.హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ”గురించి తెలిసి ఉండాలని చిన్న చిన్న రోడ్ల నుండి పెద్ద రోడ్లు ప్రవేశించే ముందు వాహనాన్ని ఒక్కసారి నిలిపి ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారు, ఎటువైపు వెళ్లాలో ఒక నిమిషం పాటు ఆగి ఇటువంటి పొరపాటు జరగకుండా వెళ్లాలని, మరియు రోడ్డుపై ప్రజా అవగాహన నిమిత్తం వేసిన ట్రాఫిక్ పెయింట్ గుర్తులను, బోర్డ్ పై గల సూచికలను గమనించి ముందుకి సాగాలని తెలియపరిచారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి రెండు చక్రాల వాహనదారుడు తన భద్రతతో పాటు తన కుటుంబ సభ్యుల కోసం కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సందేశం:“హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి –మీ ప్రాణాలను కాపాడుకోండి.”