పోరుమామిళ్ల ( ప్రజావాణి జులై 08):తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జన్మదిన వేడుకలు (జయంతి) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో బుధవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్ అభిమానులు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకలలో హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధు బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.వైఎస్సార్ స్వర్ణ విగ్రహానికి పూలమాల వేసి,చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు. అనంతరం ఆయన సమక్షంలో అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.నిరుపేదల పెన్నిధి వైఎస్సార్ ఈ సందర్భంగా కవలకుంట్ల మధు బాబు మాట్లాడుతూ, వైఎస్సార్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, కోట్ల మంది నిరుపేదల పక్షాన నిలిచిన ఒక గొప్ప మానవతావాది అని కొనియాడారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు నేటికీ దేశ రాజకీయాలకు మార్గదర్శకంగా నిలిచాయని గుర్తుచేశారు.ఆరోగ్యశ్రీ ప్రదాత: పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఎందరో ప్రాణాలను కాపాడిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం వైఎస్సార్ హృదయం నుంచి పుట్టిందేనని అన్నారు.ఉచిత విద్యుత్ – రైతు బాంధవుడు: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల మేలు కోసం ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసి, వైఎస్సార్ నిజమైన రైతు పక్షపాతిగా నిలిచారని శ్లాఘించారు.ఫీజు రీయింబర్స్మెంట్: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి, ఎన్నో కుటుంబాలలో విద్యా వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు.108 అత్యవసర సేవలు: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టి, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. మహానేత వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజా రంజక పాలన ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో ‘రాజన్న’గా చిరస్థాయిగా జీవించే ఉంటారని మధు బాబు స్పష్టం చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు, పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనిన్నారు,