prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 9:23 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పోనుగోటి సహకారంతో ఆలయ ఆవరణలో సీసీ నిర్మాణం

పోనుగోటి సహకారంతో ఆలయ ఆవరణలో సీసీ నిర్మాణం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 22 (ప్రజావాణి)

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని దుర్గమాత ఆలయ ఆవరణలో ఆదివారం రోజున చుట్టూ సీసీ పనులను దాతల సహకారంతో పూర్తి చేశారు. సిసి నిర్మాణ పనుల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు సుమారు 2 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ నిర్మాణానికి సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బషీర్ లకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.