“పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆర్ఆర్కే ఫౌండేషన్”
“వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీ”
“సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకుల వెల్లడి”

రామచంద్రపురం, జూలై 9 (ప్రజా వాణి ): సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనివ్వడమే తమ ధ్యేయమని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ, విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లోనూ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు పాల్గొని నిత్యావసర సరుకులు అందుకున్నారు. స్థానికులు ఆర్ఆర్కే ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.