prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 12:06 pm Digital Edition : ASHOK THIRUPATHI

పుంగనూరులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో షర్మిలా రెడ్డి

అన్నమయ్య జిల్లా:

పుంగనూరులో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర..

పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక పథకాలు తెచ్చారు..

ఊపాధి హామీ పథకం గురించి అమెరికా లాంటి దేశాలు కూడా వచ్చి చూశాయి..

ఉపాధి హామీ వల్ల పేదలకు మేలుజరుగుతుంది..

మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు..

పిజిలు,డిగ్రీలు చదువుకున్న విద్యార్థులు డ్రైవర్లుగా మారారు..

ఉపాధి హామీ పథకాలను బిజీపీ కుట్ర పన్ని నాశనం చేయాలని చూస్తుంది..

కేంద్ర బడ్జెట్ లో 86వేల కోట్లు ఉపాధి హామీ కోసం ఖర్చవుతుంది..

ఈ డబ్బులు నేరుగా పేద వాళ్లకు వస్తాయి..

అందుకోసమే ఈ పథకాన్ని గండి పెట్టె ఆలోచనలో బీజేపీ ఉంది..

ఈ పథకాల డబ్బులను బీజేపీ తమ బినామిలకు,నాయకులకు ఇచ్చేందుకు ఆలోచిస్తుంది..

మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని బిజెపి నాశనం చేస్తుంది..

మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఎలా అయితే హత్య చేసాడో.. అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నాయకుడు మోదీ హత్య చేస్తున్నాడు.. APCC చీఫ్ వైఎస్ షర్మిల..