
బద్వేల్ జూన్ 5 ప్రజావాణి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం సురేంద్ర నగర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తొట్టిగారిపల్లి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు సందర్శించి ఆరోగ్య కేంద్రం లో జరుగు కార్యక్రమంలో అన్నీ కూడా పర్యవేక్షించడం అయినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ హాస్పిటల్లో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా స్టాప్ అందరు సమయపాలన పాటించి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నమోదు చేసి ప్రతి ఒక్కరికి అభ ఐడి క్రియేట్ చేసి సంక్రమణ అసంక్రమణకు సంబంధించిన సర్వే పక్కాగా జరిగింది 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ చేయవలసినదిగా ఆదేశాలించడమైనది, హాస్పిటల్ కి వచ్చి ప్రజలను స్నేహపూర్వకంగా రిసీవ్ చేసుకుని వారికి సరైన వైద్యం అందించి మెడికల్ ఆఫీసర్స్ కు ఆదేశాలు ఇవ్వడమైనది కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లేష్ ఆర్ వి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ అర్ఫి ఎపిడమాలజిస్ట్ ఖాజా వైద్యులు శ్రీనివాసులు శరత్చంద్ర శశివర్ధన్ రెడ్డి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్యలు పాల్గొనడం జరిగింది.