prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:59 am Digital Edition : PRAJA VANI

పార్కుల ఆక్రమణలు తొలగించి సుందరీకరణ చేపట్టాలి: తుంగతుర్తి రవి

సాయి ప్రియా నగర్ కాలనీలో పార్కులను పరిరక్షించాలని డిప్యూటీ  కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కులు అందించాలి – అధికారులకు తుంగతుర్తి రవి విజ్ఞప్తి

మేడిపల్లి ఆగస్టు 06 ( మన ప్రజావాణి)
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆర్‌వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి కలిసి సాయి ప్రియా నగర్‌ కాలనీలోని పార్కులను పరిరక్షించి,వెంటనే మున్సిపల్ నిధులతో పార్కులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరారు.పార్కులను పరిరక్షించి చిన్నారులు, మహిళలు,వృద్ధులు వినియోగించుకునేలా అభివృద్ధి చేయాలని,ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని తుంగతుర్తి రవి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమం లో సుదర్శన్ రెడ్డి,నాగరాజు, సాయిరాం గౌడ్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.