prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 12:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు బద్వేల్ డివిజనల్ అభివృద్ధి అధికారి వెంకట శేషయ్య

పోరుమామిళ్ల ఏప్రిల్ 8(ప్రజావాణిన్యూస్)పోరుమామిళ్ల పంచాయతీలో పారిశుధ్యం మెరుగుకు సిబ్బంది అధికారులు సమిష్టిగా కష్టపడాలని బద్వేల్ డివిజనల్ అభివృద్ధి అధికారి వెంకట శేషయ్య పేర్కొన్నారు. బుధవారం మండల అభివృద్ధి కార్యాలయం పరిధిలోని శ్రీ శక్తి భవన్లో పోరుమామిళ్ల పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేజర్ పంచాయతీలో నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడంతో పాటు తాగునీరు పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం విధుల్లో తప్పక పాల్గొనాలని చెప్పారు. సచివాలయ పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీరిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పనిచేయని వారికి జీతాలు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రతిరోజు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. క్రమంలో ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో, పోరుమామిళ్ల పిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు