బద్వేలు ప్రజావాణి న్యూస్(మార్చి29)పసుపులేటి వారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి .మున్సిపాలిటీ 11వ వార్డులోని పసుపులేటి ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా పసుపులేటి ప్రసాద్ కుటుంబ సభ్యులు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని శాలువ కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా. ఓబుళాపురం రాజశేఖర్, కాలవపల్లె వీరా రెడ్డి, అరవ శ్రీనివాసుల రెడ్డి, కొంకుల రాంబాబు, ఓబులురెడ్డి రమణ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, కలూరి దుగ్గిరెడ్డి, పరిటాల వెంకట సుబ్బయ్య, శివ రామిరెడ్డి, కొంకుల వెంకట రమణ, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.