మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు లాడ్జిలను ఎస్సై వేమన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన లాడ్జిలలోని రికార్డులను పరిశీలించారు.అదేవిధంగా లాడ్జిలలో రూమ్స్ తీసుకునే వారి వివరాలను ఆధార్ కార్డును ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.అంతేకాకుండా పట్టణ మండల ప్రాంతాలలో మఫ్టీలలో ప్రత్యేక పోలీసు బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు