prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 10:15 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పర్యావరణ ప్రకృతి ప్రేమికుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు

తిరుపతి,మే 17 ప్రజావాణి మరోసారి తన బాధ్యతను గుర్తు ఎరిగి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఇంధనం పొదుపులో భాగంగా తమ విధులకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు సోమవారం సైకిల్ పై ప్రయాణించారుప్రభుత్వం కేటాయించిన,సొంత వాహనాన్ని పక్కనపెట్టి వాతావరణ కాలుష్యం నివారణ కొరకు, ప్రధానంగా ఇంధనంపొదుపు చేయాలన్న ప్రభుత్వ పెద్దల సూచనలతో,తన లక్ష్యసాధనలో భాగంగా తమ విధులను సైకిల్ పైనే నిర్వహించి పలువురు ఉద్యోగులకు ఆదర్శప్రాయుడయ్యాడు శ్రీనివాసులు.తన ఉద్యోగ విధి నిర్వహణలో పలు అంశాలలో అందరికన్నా భిన్నంగా,సమాజ శ్రేయస్సు, భావితరాల భవిష్యత్తు కోసం,పచ్చదనం, ప్రకృతి సంపద అయిన వన్య ప్రాణులను కాపాడడం,తమ ఉద్యోగ జీవితములో వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ,ప్రకృతి పర్యావరణ ప్రేమికుడిగా ఆ శాఖలో గుర్తింపు పొందారు విధి నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించి పలుసార్లు ఉత్తమ ఉద్యోగి గా జిల్లా ఇన్చార్జి మంత్రులు,ఆ శాఖ ఉన్నతాధికారుల ద్వారా అవార్డులు అందుకునిఉన్నారు గాయం శ్రీనివాసులు తండ్రి స్వర్గీయ గాయం పెంచలయ్య ఆదర్శప్రాయుడే గాయం పెంచలయ్య తమ విధి నిర్వహణలో సైకిల్ పైనే ప్రయాణించేవారు.ఆయన ఉపాధ్యాయుడు. అనేకులకు అక్షరాభ్యాసంఅందించి,ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత నాడు ఆయనకే దక్కుతుంది.రాబోవు రోజుల్లో గాయం శ్రీనివాసులు ప్రభుత్వ ఉద్యోగులకే ల్యాండ్ మార్కర్ గా నిలవాలని ఆకాంక్షిస్తూ