prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 5:54 am Digital Edition : PRAJA VANI

పదవ వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ పత్రాల స్వీకరణ<br>

పదవ వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ పత్రాల స్వీకరణ

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ఫామ్ నింపి ఇవ్వాలి

మన సమగ్ర ప్రజావాణి జులై 15
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ఆందోల్ నియోజకవర్గం లోని
జోగిపేట మున్సిపాలిటీ 10వ వార్డులో మంగళవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్న్యుమరేషన్ పత్రాల స్వీకరణ  చేపట్టారు. కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్, బీఎల్ఓ సుమిత్ర  బీఎల్ఏ మోదిని రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్ ఐ ఆర్ ఫామ్ తప్పకుండా నింపి ఇవ్వాలి లేదంటే వారి ఓటు గల్లంతు అవుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్, నాయకులు, మదరి నాగరాజ్  కాలినివాసుల నుండి ఎన్యుమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగింది  ఇంకా ఎవరైనా పత్రాలు ఇవ్వని వాళ్ళు ఉంటే మన గల్లీలోని బి ఎల్ ఓ మరియు మన కౌన్సిలర్ కు అందజేయగలరు.