prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 12:20 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పట్ట పగలే బంగారం చోరీ లు… అడ్డుకున్న మహిళల హత్యలు,

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 06) వినుకొండ  లో పట్టపగలే బంగారం చోరిలు – హత్యలతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  గత రెండు సంవత్సరాల్లో బంగారం కోసం.ముగ్గురు మహిళలను హత్య చేసిన దుండగులు,పలువురు మహిళల మెడల్లో బంగారం.పలు గృహాల్లో చోరీ లు,మహిళల హత్య ఘటనల్లో లభించని హంతకుల ఆచూకీ.గత రెండు సంవత్సరాల కాలంలో బంగారం కోసం ఇళ్లలోకి చోరబడి అత్యంత దారుణంగా ముగ్గురు మహిళలను దుండగులు అత్యంత పాశవికంగా హత్యలు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఇవి కాకుండా పలువురు మహిళల మెడల్లో బంగారం,ఇళ్లలో చోరీ సంఘటనలు జరిగాయి.వీటిల్లో పూరోగతి దేవుడూకే ఎరుక.ఇవి మరిచే లోగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని దక్షిణం బజారు లో చోరీ సంఘటనతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.దక్షిణం బజారు భావన రుషి గుడి పక్కన బజారు లో ఇంట్లోకి ఒక యువకుడు ప్రవేశించి మహిళ మెడలో బంగారు నాన్ తాడు చోరీ చేస్తుండగా అడ్డుకున్న మహిళ భర్త కళ్ళల్లో కారం కొట్టి,బంగారు చైనుతో దుండగుడు పరారయ్యాడు. పట్టణంలో వరుస చోరీ సంఘటనలతో మహిళలు ఇంటి ముందు కాదు ఇళ్లలో ఉండాలన్నా బయపడవలసిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన చెందుతున్నారు