అనంత పురం బ్యూరో జూలై 21 నేటి ప్రభాత సూర్య
అనంతపురం నగరానికి విచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టాభి రామ్ కు శాలువాతో సత్కరించారు.అనంతపురం మార్కెట్ యార్డ్లో రైతుల సౌకర్యార్థం మరుగుదొడ్ల ఏర్పాటు అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు .దీనిపై సానుకూలంగా స్పందించిన పట్టాభిరామ్ మార్కెట్ యార్డ్లో రైతుల కోసం మరుగుదొడ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని పాల్గొన్నారు.