prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 4:01 am Digital Edition : PRAJA VANI

నేడు చిగురుమామిడిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి

నేడు చిగురుమామిడిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్

 

చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి

 

మన ప్రజావాణి ప్రతినిధి

(చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నేడు అనగా మార్చి 08, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు మాజీ జెడ్పిటిసి సభ్యులు గీకూరు రవీందర్ గారి నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు తదితర విషయాలపై ముఖ్యమైన ప్రకటనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.కావున ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకులు హాజరు కావాలని అన్నారు