prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:46 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నూతన కోర్టు భవన సముదాయాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి

 

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) ప్రొద్దుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన VIII అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు మరియు అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.  ఆయనతో పాటు ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శ్రీ జస్టిస్ బాలాజీ మేడమల్లి. పూజ అనంతరం సర్వ మతాల సాక్షిగా న్యాయ వ్యవస్థ సుభిక్షంగా నడవాలని.. ఆశీర్వచనాలు అందించిన అర్చక, ఫాస్టర్, మౌజం మత గురువులు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హాజరైన కడప ప్రధాన జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని, అ. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి మారుతి ప్రసాద్, పలువురు జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు.