prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:55 am Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

నిజాంసాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం 7.845 టీఎంసీలకు చేరుకున్న నీటి నిలువ.

నిజాంసాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం 7.845 టీఎంసీలకు చేరుకున్న నీటి నిలువ.

బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం 6 గంటలకు 1396.30/1405.00 అడుగులుగా ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు.ప్రస్తుత నిల్వ 7.845/17.802 టీఎంసీలుగా ఉందన్నారు.గత ఏడాది ఇదే రోజున నీటి మట్టం 1391.34 అడుగులు,నిల్వ 4.642 టీఎంసీలు ఉందనీ.గత 24 గంటల్లో 4530 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరగా,151 క్యూసెక్కులు ఆవిరి ద్వారా బయటకు వెళుతోందనీ.ప్రస్తుతం ప్రాజెక్టు నుండి ఎలాంటి గేట్ల ద్వారా నీటి విడుదల లేదని అధికారులు పేర్కొన్నారు.