prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:23 pm Digital Edition : PRAJA VANI

ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసిన తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు.

ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసిన తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు.

తవణంపల్లి జూన్ 14 ప్రజావాణి: తవణంపల్లి మండల కేంద్రంలోని తిరుపతి బెంగళూరు ప్రధాన రహదారి నందు ద్విచక్ర వాహనాలను తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా తనికి సమయంలో ద్విచక్ర వాహనదారులతో అయన మాట్లాడుతూ వాహనదారులు లైసెన్స్, తప్పక కలిగి ఉండాలని వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.మద్యం సేవించి వాహనాలు నడప రాదని నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.