prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 4:08 am Digital Edition : RAJASHEKARREDDY

దేవక్కపల్లి గ్రామంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దేవక్కపల్లి గ్రామంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బెజ్జంకి, ఏప్రిల్ 6(ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం 251వ బూత్‌లో పార్టీ జెండాను బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు జంగిడి కమలాకర్ రెడ్డి, బిరం చంద్రారెడ్డి, రావుల రాజిరెడ్డి, కొమ్ము మల్లేశం, తిరుపతి రెడ్డి, కొండ లక్ష్మణ్, సుగుణాకర్ రెడ్డి, సుడగోని రాజు తదితరులు పాల్గొన్నారు.