prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 4:04 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

దామరకుంటలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం..-నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం..-సర్పంచ్ పత్తి నర్సింలు..

దామరకుంటలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం..-నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం..-సర్పంచ్ పత్తి నర్సింలు..

సిద్దిపేట జిల్లా,మర్కుక్, మార్చి 9, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మనిషా,రాజు, గృహప్రవేశం సోమవారం ఘనంగా నిర్వహించారు, ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, పత్తి నర్సింలు, మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యమని దామర కుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా వస్తాయని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవి, విజయ, రమేష్, వార్డ్ సభ్యులు,నాయకులు రమేష్ యాదవ్,సంజీవ్,ప్రభు,రమేష్,బాల నరసింహులు, భానుచందర్,బాలరాజు, లక్ష్మయ్య,బాలరాజును, ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.