తోటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
బెజ్జంకి,ఏప్రిల్ 7(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన 5 మంది వార్డు సభ్యులు మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వార్డు సభ్యులు ముత్త బీరయ్య, దయ్యాల ఐలవ్వ,ఐలయ్య, ఏనుగుల అనిత,అశోక్, నల్లగొండ రాములు, జనగం లక్ష్మి, లక్ష్మయ్యలకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ,తోటపల్లి గ్రామ అభివృద్ధి దృష్ట్యా తాము ఐదుగురం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్,బెజ్జంకి మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల ఐలేష్, బైర సంతోష్, గుంటి అంజి, గుంటి అశోక్,గుంటి ఓదెయ్య, ఒగ్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు.