•తెల్లాపూర్లో శ్రీ ఉమామహేశ్వర స్వామి వాయు ప్రతిష్ఠ మహోత్సవం 
పటాన్చెరు, జూలై 5(ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి వాయు ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. సి. అంజిరెడ్డి, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకకల్యాణం, రాష్ట్ర ప్రజలతో పాటు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శంషాబాద్ రాజు, శ్రీకృష్ణమూర్తి, ప్రవీణ్తో పాటు స్థానిక భక్తులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.