తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొహరం శుభాకాంక్షలు
మన సమగ్ర ప్రజావాణి జూన్ 26 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవిత్ర మొహరం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జితేందర్ రావు తనుగుల సందేశం విడుదల చేశారు.
మొహరం త్యాగం, ధర్మం, సత్యం మరియు మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్న ఆయన, ఈ పర్వదినం సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మొహరం శుభాకాంక్షలు తెలిపారు.