prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:20 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా “రాష్ట్ర పండుగగా” ప్రకటించింది.

ప్రజావాణి
ఏప్రిల్ :23
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా “రాష్ట్ర పండుగగా” ప్రకటించింది.
ముఖ్య విశేషాలు:
ప్రతి సంవత్సరం “వైశాఖ శుక్ల పక్ష దశమి” నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఈ వేడుకలను నిర్వహిస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, కాల్వ సుజాత గుప్త కి, మా ప్రియతమ నేత ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ కి  ఆర్యవైశ్యుల పక్షాన గంప ప్రసాద్  హృదయపూర్వక ధన్యవాదాలు