ఎన్టీఆర్ జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ విజయవాడ కృష్ణలంకలో సునీత ఏజెన్సీ అనే గూడంలో డంప్ చేశారనే సమాచారం అందుకున్న (ఆర్ ఐ ) మణికంఠ (ఏఎస్ఓ) శ్రీనివాస్ వెంటనే గూడెం దగ్గరికి చేరుకొని తనిఖీలు చేయగా రేషన్ బియ్యం (10) బస్తాలు దొరికాయి సీజ్ చేసి ఈ రేషన్ బస్తాలు ఎవరివి అని ఆరా తీయగా.కృష్ణలంక స్టోర్ నెం :311 రేషన్ డీలర్ (ఘంటా లక్ష్మి రాజ్యం) తనయుడు ఆనంద్ గా గుర్తించారు వెంటనే రేషన్ డీలర్ ఆనంద్ మీద కేసు నమోదు చేశారు అదే గూడెంలో (సునీత ఏజెన్సీ) ఎక్స్పైర్ అయిపోయిన కూల్డ్రింక్స్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ భారీగా ఉన్నాయి వెంటనే సమాచారం తెలుసుకున్న (ఫుడ్ ఇన్స్పెక్టర్) శ్రీనివాస్ గూడం దగ్గరికి చేరుకొని తనిఖీలు చేయగా భారీ మొత్తంలో ఎక్స్పైర్ అయిపోయిన కూల్డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ దొరికాయి.సునీత ఎంటర్ప్రైజెస్ కి ఫుడ్ లైసెన్స్ కూడా లేదు ఎక్స్పైర్ అయిపోయి సంవత్సరం అయినందువలన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గూడం సీజ్ చేసి కేసు నమోదు చేశారు ప్రజల ప్రాణాలకు సైతం లెక్కచేయని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు