prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 1:32 pm Digital Edition : PRAJA VANI

తుమ్మల బయలు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా — ప్రయాణికులు సురక్షితం

🚌 తుమ్మల బయలు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా — ప్రయాణికులు సురక్షితం
నంద్యాల జిల్లా, శ్రీశైలం ప్రాజెక్టు, ఏప్రిల్ 21 (ప్రజావాణి):
శ్రీశైలం నుండి దోర్నాల వైపు ప్రయాణిస్తున్న మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మల బయలు సమీపంలో మంగళవారం బోల్తా పడింది.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు తగలకపోవడం అదృష్టకరంగా మారింది. ప్రమాదంతో బస్సు అద్దాలు పగిలి వాహనం కొంత మేర దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను బయటకు తీసి భద్రత కల్పించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.