సిద్దిపేట జిల్లా, ప్రజావాణి
సిద్దిపేట జిల్ల జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం జగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల సీతయ్య ఆధ్వర్యంలో రజక సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహిచారు.తీగుల్ రజక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.తిగుల్ గ్రామ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల స్వామి ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీకాంత్, రాచమల్ల నాగరాజు, కోశాధికారి రాచమల్ల గణేష్, ప్రచార కార్యదర్శి రాచమల్ల కుమార్, అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, సలహాదారులు పరదేశి భిక్షపతి, రాచమల్ల చంద్ర శేఖర్ ,జనరల్ సెక్రటరీ రాచమల్ల అజయ్, జయింట్ సెక్రటరీ పరదేసి కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన గ్రామ రజక సంఘం బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రజక ఐక్యత కు సంఘం అభివృద్ధికి కులస్తుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తీగుల్ రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.