
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)తిరుపతి లో ఇటీవల జరిగిన తహసిల్దార్ మార్పిడిలో భాగంగా నాయుడుపేట మండల రెవెన్యూ కార్యాలయానికి నూతన తాసిల్దార్ నియమించిన విషయం తెలిసినదే.తాసిల్దార్ తన తడాఖా చూపించగలరా.లేక రాజకీయ వత్తిడీల తడబాటును తట్టుకోగలరా.నాయుడుపేట నయా తాసిల్దార్ నామమాత్రపు అధికారిలా ఉంటాడా.లేక న్యాయం వైపు నిలబడి పేదల పక్షాన పోరాడుతాడా.తాసిల్దార్ అడుగులు ఎటువైపు.నడక ఎక్కడిదాకా.ఈ నేపథ్యంలో గురువారం నూతన తాసిల్దార్ గా నాయుడుపేట రెవిన్యూ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.కాగా తాసిల్దార్ విధి నిర్వహణలో నిజాయితీగా నిలబడి తన బాధ్యతలకు న్యాయం చేయగలడా.అవినీతి సంపద చేతిలో బందీగా మారి.రాజకీయ వత్తెళ్లకు తలవంచి పేద ప్రజలకు తలకు మించిన భారం అవుతాడా అంటూ మండల ప్రజల మదిలో అనేక సందేహాలు మెదులుతున్నాయి.కాలమే సమాధానం చెబుతోంది తాసిల్దార్ కదా ఏమిటో.అప్పటిదాకా వేచి చూద్దాం.