తంగేలపల్లిలో శ్రీ నంధీశ్వర,ధ్వజస్తంభ ప్రతిస్థాపన మహోత్సవాలు
ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని తంగెలపల్లి గ్రామంలో శివాలయంలో శ్రీ నందీశ్వర ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అత్యంత పవిత్రమైనదని,ఇది ఆలయ నిర్మాణంలో వెన్నెముక వంటిదని దైవశక్తిని ఆలయంలోకి ఆకర్షించి, భక్తులకు దైవదర్శనం ముందు సూచనగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్,మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ మహాదేవపూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,ఉమెంతాల సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి,విశ్వనాధ్ పూర్ సర్పంచ్ శ్రీలత రాములు,ఉత్తరాస్ పల్లి సర్పంచ్ నందు,ఉపసర్పంచ్ హలీం బాయ్,మాజీ సర్పంచులు బాల్ రాజ్,గోపాల్ నాయక్,వెంకటేష్,జనార్దన్ గౌడ్, పలువురు మాజీ ప్రజాపప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ శ్రీశైలంగౌడ్,రవీందర్ గౌడ్,నర్సిములు,పెర్మల్ రెడ్డి, పులిందర్ రెడ్డి,నగేష్ ప్రవీణ్,హన్మంత్,యాదయ్య, వెంకటేష్,క్రిష్ణ బండి శేఖర్,కొత్త బాల్ రాజ్,చెంద్రయ్య,శ్రీను,శ్రీకాంత్ గౌడ్, యాదగిరి,సిహెచ్ రాము,బాగల్ల రాములు, కబీర్ దాస్,గణేష్ నగేష్,క్రిష్ణ,ప్రశాంత్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.