డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వ్యక్తికి రెండు రోజుల కస్టడీ జైలు శిక్ష..
సిద్దిపేట జిల్లా,ప్రజావాణి
సిద్ధిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. రూరల్ఎస్సైరాజేష్,సమక్షంలో చేపట్టిన తనిఖీలలో బొర్రోజు రాజు చారి (35), మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి రెండు రోజుల కస్టడీ జైలు శిక్ష విధించినట్లు ఎస్పై రాజేష్, తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పై రాజేష్ మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రాణనష్టం నివారించలేని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.