మన సమగ్ర ప్రజావాణి జులై 18(జోగిపేట) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
జోగిపేట వాసవినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి కృష్ణ గౌరమ్మ దంపతులకు మగ శిశువు జన్మించాడు. గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య తరచూ గొడవలు ఉండటంతో శుక్రవారం రాత్రి భార్య వంట చేయలేదని కారణంతో భర్త కృష్ణ 18 రోజుల కన్న కొడుకుఅని చూడకుండా పసికందు పై ఉన్మాదిగా మారి దారుణంగా నేలకేసి కొట్టి చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని తీవ్రంగా గాయపడిన చిన్నారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు.నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
