prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 3:22 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ బలోపేతం. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ. అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా. జిల్లా ఎస్పీ

                                                                          తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహణ.ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు.  ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విస్తృతంగా విసిబుల్ పోలీసింగ్ చేపడుతున్నారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం మరియు నేరాలను నిరోధించడం ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.  ఇందులో భాగంగా కీలక ప్రాంతాలు,రద్దీ ప్రదేశాలు మరియు సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పహారా బలోపేతం చేసి,అనుమానాస్పద వ్యక్తులు మరియు కార్యకలాపాలపై కఠినంగా నిఘా ఉంచుతున్నారు.అదేవిధంగా,జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతూ,ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలు, పత్రాలు లేని వాహనాలు మరియు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.అలాగే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.పై నుంచి పరిస్థితులను గమనిస్తూ, ఎటువంటి