prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 5:03 am Digital Edition : MEERASAHAB CHILUKUR

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేతవోలులో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

*చిలుకూరు ఏప్రిల్11(ప్రజావాణి)*:సంఘసంస్కర్త, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి,కుల నిర్మూలన కోసం కృషిచేసిన మహాత్మ, సామాజిక సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం పోరాటం చేసిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. బేతవోలు పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క.కృష్ణ మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర మొత్తం చక్కగా వివరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, వీరబాబు, సౌరీ, వెంకన్న, ఉపేందర్, కల్పన, శ్రీరామ్ , ప్రకాశం , వెంకటేశ్వర్లు, నరసింహారావు, మైసయ్య, లాల్ మహమ్మద్ , రాజ్యం పాల్గొన్నారు.