prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:53 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

జలసిరి పనులు త్వరగా పూర్తి చేయాలి: డీఆర్‌డీఓ నాగ పద్మజ 

జలసిరి పనులు త్వరగా పూర్తి చేయాలి: డీఆర్‌డీఓ నాగ పద్మజ 

చెన్నారావుపేట జూలై 18 ప్రజావాణి

చెన్నారావుపేట మండల కేంద్రంలోని జోజిపేట నారాయణ తండా, తిమ్మరాయిని పహాడ్ గ్రామాల్లో శనివారము డీఆర్‌డీఓ నాగ పద్మజ పర్యటించి జలసిరి నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు గ్రామ సర్పంచ్ లకు సూచించారు.ఇందులో భాగంగా ఫార్మ్ పాండ్స్, వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్, పర్కోలేషన్ ట్యాంకులు, కమ్యూనిటీ మరియు వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వీటితో పాటు బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు, బహిరంగ బావుల పునరుద్ధరణ పనులను తక్షణమే గుర్తించాలని, గుర్తించిన అన్ని పనులకు సంబంధించిన నివేదికలు, సాంకేతిక అంచనాలను అత్యంత వేగంగా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాలని నీటి సంరక్షణ లక్ష్యాలను సకాలంలో చేరుకునేందుకు సిబ్బంది నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటశివానంద్, ఏపీఎం తిలక్, సర్పంచ్ చెందు, తదితరులు పాల్గోన్నారు.