- *చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో పర్యటించిన ఇ ఎల్ వి భాస్కర్
*
*(ప్రజావాణి) చౌటుప్పల్*
చౌటుప్పల్ మండలం లోని కుంట్లగూడెం గ్రామ సర్పంచ్ నరేష్ ఆహ్వానం మేరకు గ్రామాన్ని సందర్శించిన ఆయన, స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల 10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను భాస్కర్ సన్మానించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఉపయోగపడేలా ముందుకు సాగాలని సూచించారు.