prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 3:46 pm Digital Edition : VEMULARAMESH MOTHE

చెరువుని తలపిస్తున్న మామిళ్ళగూడెం ప్రధాన రహదారి…. ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్న వర్షానికే నిలిచిన నీరు……

ప్రజావాణి మోతే జూన్ 28:మామిళ్ళగూడెం గ్రామం నుండి తుమ్మలపల్లి, కొత్తగూడెం గ్రామాలకు వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇది. కొద్దిపాటి వర్షం వచ్చిన డ్రైనేజి వ్యవస్థ పూడ్చడం ద్వారా ఏర్పడిన సమస్య, ఇలా నీరు నిలవడం ద్వారా సీసీ రోడ్ త్వరగా పాడవుతున్నదని,అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా సమస్యకు పరిస్కారం చూపడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.