చెన్నారావుపేట నల్లాల బావిలోనీ కుక్క కలేబరం తొలగింపు
చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి
మండల కేంద్రంలోని నల్లాల బావిలో పడిన కుక్క కలేబరాన్ని సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ తక్షణమేతొలగించారు.పంచాయతీ సిబ్బందితో కలిసి బావి శుభ్రత చర్యలు చేపట్టారు.మోటార్ల సహాయంతో బావిలోని కలుషిత నీటినంతటినీ బయటకు తోడించి, బ్లీచింగ్ పౌడర్తో బావిని పూర్తిగా శుభ్రం చేయించారు.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.బావిలో నీటి కాలుష్యం పట్ల గ్రామస్తులు ఎవరూ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ పారిశుధ్య కార్యక్రమంలో గ్రామ కారోబార్ కరెడ్ల రాజు, పంచాయతీ సిబ్బంది ఎల్ల గౌడ్, బొనగిరి కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.