చలో అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు యత్నం
ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు
బెజ్జంకి, మార్చి 28( ప్రజావాణి)
శనివారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా వారి ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం పై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.