ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు,తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి చెందటము మరియు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆట ఆధారిత విద్యా అలాగే సామాజ యెక్క పాత్ర, మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు స్క్రీన్( సెల్ ఫోన్లు టీవీలు ) అందుబాటులో ఉంచకపోవడం ప్రారంభ విద్య మరియు ఎదుగుదల ఆటల ద్వారా నేర్చుకోవడం బొమ్మలు తయారుచేయడం తల్లిదండ్రులు (ప్రత్యేకంగా తండ్రులు) పాడైన వస్తువులతో బొమ్మలు తయారు చేయడం నేర్పిస్తూ వారికి కథలు చెబుతూ కథలు ద్వారా ప్రారంభ అక్షరాస్యతను ప్రోత్సహించి పిల్లలలో మేధాశక్తిని పెంచడం.మొదలగు అంశాల గురించి (ఐ సి డి సి ఎస్ ప్రాజెక్ట్) నందిగామ సూపర్వైజర్ పి . శ్రీలత వారికి అర్థమయ్యే విధంగా వివరించి జంక్ ఫుడ్ కి దూరంగావుంటూ ఇంట్లోనే తయారు చేసుకున్న స్నాక్స్ తీసుకోవాలి ( బిస్కెట్లు కి బదులుగా మిల్లెట్స్ లడ్డు ) మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలను ఉపయోగించకూడదు అధిక కొవ్వు చక్కెర ఉప్పు ఉన్నా అల్ట్రా ప్రాసెస్ ఆహారాలను తగ్గించాలి అని ఈ కార్యక్రమంలో వారికి తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమమునకు (ఐ సి డి ఎస్) ప్రాజెక్ట్ సూపర్వైజర్ పి.శ్రీలత ఏఎన్ఎం ఆశవర్కర్స్,అంగన్వాడి వర్కర్ సైదమ్మ, గర్భిణీస్త్రీలు,బాలింతలు,తల్లిదండ్రులు,అమ్మమ్మలు నాయనమ్మలు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.