prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:02 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకుార మల్లారెడ్డి చలివేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి

మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు విపరీతంగా ముదిరిపోయిన కారణంగా వాహనదారులు, పాదచారులు ప్రజలకు మంచినీరు అవసరాన్ని గుర్తించి వాడి దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అవసరమైతే తప్ప మిగతా సమయంలో బయటికి రాకూడదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమగోని రమాదేవి, మహిపాల్ గౌడ్, పోచారం మాజీ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ నాయకులు నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకులు మొక్క ఉపేందర్, ఘట్కేసర్ మండలంలోని మాజీ సర్పంచ్ నర్సింగ్ రావు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కో-ఆప్షన్ సభ్యులు వార్డు కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా , నాయకులు, బూత్ కమిటీ సభ్యులు తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..