మన ప్రజావాణి తవణంపల్లి ఫిబ్రవరి 23:
చత్తూరు జిల్లా తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి తాసిల్దార్ కు రైతులు ప్రజలు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. తవణంపల్లి మండలంలో ని గ్రీవెన్స్ డే సందర్భంగా రైతులు ప్రజలు, గతంలో రైతుల భూముల రీ సర్వే పై తప్పుల తడకలు,భూ సమస్యలు, పలు సమస్యలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ కు పలువురు లబ్ధిదారులు, అర్జీలు సమర్పించారు. అనంతరం తవణంపల్లి మండలానికి చెందిన పలువురు రైతులకు సంబంధించి సమస్యలు తవణంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి గ్రీవెన్స లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని తవణంపల్లి ఎమ్మార్వో మాధవరాజు దృష్టికి రాగా వెంటనే ఎంఆర్ఓ స్పందించి పలు సమస్యలను వెంటనే పరిష్కరించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందిని తదితరులు పాల్గొన్నారు.